Monday, April 29, 2024

Sangareddy : బైక్ ను ఢీకొట్టిన లారీ… ఇద్దరు మృతి

బైక్ ను లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని 65వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఇవాళ ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

నాందేడ్ – అకోల ర‌హ‌దారిలో మామిడిప‌ల్లి ఎక్స్ రోడ్డు వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రిని లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతులు అరబిందో ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తున్న కార్మికులని, వారిని శ్రీకాకుళంకు చెందిన వార‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement