Sunday, May 5, 2024

Protest – ఉచితం ఎత్తివేయాల‌ని కోరుతూ ఆటో డ్రైవ‌ర్లు బ‌స్ భ‌వ‌న్ ముట్ట‌డి…

హైదరాబాద్‌: మ‌హిళ‌ల ఉచితం ప్ర‌మాణ స్కీమ్ ను ఎత్తివేయాల‌ని కోరుతూ మంగళవారం ఉదయం భారతీయ మజ్దూర్‌ సింఘ్‌(బీఎంఎస్‌) ఆటో కార్మికులు బ‌స్ భ‌వ‌న్ ముట్ట‌డికి యత్నించారు. ఈ క్రమంలో బస్‌భవన్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చింద‌ని అన్నారు. ఓలా, ఉబర్ రాపిడోలతో ఇప్ప‌టికే ఇబ్బందులు పడుతున్నామని.. వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో కార్మికులు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement