Thursday, May 2, 2024

18ఏళ్లు నిండిన వారు ఓట‌రు న‌మోదుగా చేసుకోవాలి : రామ్ ప్ర‌సాద్

మంగళగిరి : 1.1.2022 నాటికి 18 ఏళ్ళు నిండనున్న వారు ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ప్రత్యేక క్యాంప్ ల‌లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని మంగళగిరి తహసీల్ధార్ జీవి రామ్ ప్రసాద్ సూచించారు. 20, 21 తేదీల్లో మంగళగిరి పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లోని ప్రతీ పోలింగ్ బూత్ నందు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు బీఎల్వోలు ఓటర్ల జాభితాతో అందుబాటులో ఉంటారని తెలిపారు. వారి వద్దకెళ్లి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటరు కార్డులో తప్పుల సవరణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిర పడిన వారు, దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఓటరు మరణిస్తే వారి ఓటును తొలగింపున‌కు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్ధార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement