Friday, April 26, 2024

నాడు మామ.. నేడు భార్య.. చంద్రబాబుకు పదవీ కాంక్ష: విజయసాయి

ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపతికన సహాయ చర్యలు చేపట్టిందని వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తాను మళ్ళీ సీఎం అయ్యాక బాధితులకు 25 లక్షల పరిహారం ఇస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు.


సంస్కారహీనత, మానసికదౌర్బల్యం, చపలచిత్తం కలిగిన చంద్రబాబుకు అధికారమే అంతిమ లక్ష్యం అని విమర్శించారు. ‘’పదవి కోసం నాడు మామని బలిచేశాడు.. పదవీవ్యామోహంతో ఇపుడు భార్యనే బద్నామ్ చేస్తున్నాడు. తన అస్తిత్వం కోసం పరుల చావు కోరుకునేంత పదవీ కాంక్ష. మనిషనేవాడు మారతాడు అంటారు. బాబు మాత్రం మరీ దిగజారిపోతున్నాడు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement