Friday, April 19, 2024

అమ్మో…3కోట్ల గంజాయి.. దొంగ‌లు దొరికారు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. పోలీసులు అంత‌ర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి, వారి వ‌ద్ద నుంచి 1820 కిలోల గంజాయిని ప‌ట్టుకున్నారు. ప‌ట్టుబ‌డిన గంజాయి విలువ రూ.3కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖ సీలేరు నుంచి మ‌హారాష్ట్ర కు త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ లో ప‌ట్టుకున్నారు. గంజాయిని త‌ర‌లిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. గంజాయిని ఏపీలోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. 10 టైర్ల లారీలో గంజాయిని ముఠా తరలిస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement