Sunday, April 28, 2024

సీఐడీ చీఫ్‌ సునీల్ పై హోంశాఖకు రఘురామ ఫిర్యాదు

ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌పై కేంద్ర హోంశాఖకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్‌ను కీలక పదవి నుంచి తొలగించాలని కోరారు. భార్య అరుణ వరకట్నం వేధింపుల కేసులో సునీల్‌కుమార్‌పై చార్జ్‌షీట్‌ దాఖలైందని, కీలక పదవిలో ఉన్న సునీల్‌ కుమార్ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆరోపించారు. తనను అరెస్టు చేయవద్దని హైకోర్టు నుంచి సునీల్‌కుమార్ రక్షణ పొందారని ఫిర్యాదులో ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement