Friday, May 17, 2024

AP | టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట..

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కూడా పార్టీలో చేరారు. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన చెంచు గరటయ్య, కృష్ణచైతన్యలు కూడా టీడీపీలో చేరారు. వీరందరినీ చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ నెల  28వ తేదిన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాగుంట ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement