Tuesday, April 30, 2024

Tirupati: ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శ్రీకాళహస్తిలో తల్లి ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపి.. ఆ తర్వాత తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. అయితే ఈ విషాద ఘటనకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. మృతులు శివమ్మ, రోహిత్ (3), దేవాన్ష్ (10నెలలు)గా గుర్తించారు. దీంతో పోలీసులు శివమ్మ భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement