Monday, April 29, 2024

మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశాల.. దరఖాస్తు గడువు పెంపు

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును పెంచుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.

శుక్రవారంతో గడువు ముగియనుండగా మరో వారంపాటు పెంచి ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్జేడీలు, డీఈవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement