Friday, May 3, 2024

గుడివాడ క్యాసినోపై ఎమ్మెల్యే వంశీ కీలక వ్యాఖ్య

ఏపీలో సంచలనంగా మారిన గుడివాడ క్యాసినో విషయంపై మంత్రి కొడాలి నానిని ప్రతిపక్ష టీడీపీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని తెలిపారు. మంత్రి కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో తన స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని చెప్పారు. వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదన్నారు. అది క్యాసినో, క్యాబేరో కాదని ఎమ్మెల్యే వంశీ అన్నారు.

టీడీపీ హయాంలో నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టు కే కన్వేషన్ లో కాదు దాని పక్కన లే అవుతున్న స్థలంలో జరిగాయని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నానా యాగీ చేస్తోందని విమర్శించారు. తాను, మంత్రి కొడాలి నాని టీడీపీని విమర్శస్తున్నామనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement