Thursday, April 25, 2024

వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా

చిత్తురు జిల్లా నగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వాలీబాల్ ఆడారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే తన సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డితో పాల్గొన్నారు. పుత్తూరు మండల వాలీబాల్ పోటీలను ఎస్.ఆర్.ఎస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా సాగిన వాలీబాల్ క్రీడ ఆద్యంతం పువ్వులు పూయించింది. వాలీబాల్ క్రీడలో అన్నా చెల్లెలు అయిన ఆర్కే రోజా ,  రామ్ ప్రసాద్ రెడ్డి పోటీ పడడం ప్రేక్షకులను ఉత్తేజ పరిచింది. స్పోర్ట్స్ మీట్ కి సంబంధించి కమిటీ సభ్యులు, వాలీబాల్ స్పోర్ట్స్ ఇన్చార్జులు, వైయస్సార్సిపి నాయకులు, కార్యకర్తలు ఆర్ కే రోజా చారిటబుల్ ట్రస్ట్ క్రీడా ఉత్సవాలలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement