Thursday, May 2, 2024

ఎంపీ రఘురామ సభ్యత్వాన్ని రద్దు చేయండిః వైసీపీ ఎమ్మెల్యే

ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ పై నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు హర్షం వ్యక్తం చేశారు. వైసీపి పార్టీ గుర్తుపై గెలిచి ఎంపి రఘురామ కృష్ణం రాజు పార్టీని, ప్రభుత్వాన్నే విమర్శించడం నేరం అని పేర్కొన్నారు. ఎంపీ కొంత మంది ప్రతిపక్ష నాయకులతో చేతులు కలిపి వైసీపి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోకి అడుగు పెడితే ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. అందుకే 18 నెలలుగా ఎంపీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడం లేదన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్ స్పీకర్ ఎంపి రఘురామ కృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement