Saturday, April 20, 2024

మెగాస్టార్ సినిమాపై వస్తున్న రూమర్స్ ఫేక్

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో వైపు రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రీమేక్ చిత్రాల్లో నటించబోతున్నారు. వాటిలో లూసిఫర్ రీమేక్ ఒకటి. అయితే ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్ర దర్శకుడు మోహన్ రాజా సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వచ్చింది. కానీ అసలు విషయం ఏంటంటే అదంతా ఒత్తి పుకార్లాట. దీనితో అందులో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement