Thursday, May 2, 2024

లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మను కలిసిన మంత్రి రోజా

ఏపీ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా విస్తృత స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు పరిపాలనా సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోవైపు ప్రముఖులను కలుస్తున్నారు. లేటెస్ట్​గా వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఇవ్వాల కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఉన్న విజయమ్మ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం రోజా పాటుపడుతున్న తీరు పట్ల విజయమ్మ అభినందించారు.

రోజా పార్టీ కోసం, పార్టీ అధినాయకత్వంపై నమ్మకంతో ఎంతో నిబద్ధతతో కష్టపడుతుందని విజయమ్మ కొనియాడారు. ప్రతి నేతకు ఉండాల్సిన లక్షణం ఇదేనని గతంలో వైఎస్సార్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేకాకుండా రోజా అంటే సీఎం జగన్ కు, వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రేమ ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement