Sunday, April 28, 2024

Minister RK Roja: జగనే మళ్లీ సీఎం కావాలి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మంత్రి ఆర్కే రోజా ఆకాక్షించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి.. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు.. ఇక, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆడండి, పాడండి, ఎంజాయ్ చేయండి అని మంత్రి ఆర్కే రోజా సూచించారు.

మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య యూవర్శిటీలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రోగ్రాంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. నన్నయ్య వర్శిటీలో వివిధ ప్రాంతాల‌ ఛాంపియన్ షిప్ విద్యార్థులకు గౌరవ వందనం చేశారు. నన్నయ్య వాణితో మంత్రిని అలరించారు యూనివర్సిటీ సిబ్బంది. ఇక, ఈ రోజు పాలకొల్లులోనూ మంత్రి రోజా పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement