Wednesday, May 1, 2024

AP: చంద్ర‌బాబు పొత్తులపై.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

టిడిపి పొత్తుల‌పై మంత్రి పెద్దిరెడ్డి హాట్ హాట్
ఎన్ని పార్టీలు క‌ల‌సినా జ‌గ‌న్ దే గెలుపు
అందితే జ‌ట్టు లేక‌పోతే కాళ్లు ప‌ట్టుకునే ర‌కం చంద్ర‌బాబు
అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే
క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు

క‌ర్నూలు – పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేడ‌ని, అత‌డో రాజకీయ వికలాంగుడు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి… పొత్తులను ముందుగా ఊహించిందేన‌ని అంటూ ఎన్ని పార్టీల‌తో విప‌క్షాలు పొత్తు పెట్టుకున్నా జ‌గ‌న్ గెలుపును ఆప‌లేర‌ని అన్నారు.. క‌ర్నూలులో ఆయ‌న మాట్లాడుతూ… గ‌తం కంటే వైసిపికి అధిక సీట్లు సాధిస్తామన్నారు. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారని, జుట్టు అందలేదని కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. జగన్ మూడు రాజధానులకు కట్టుబడి వున్నారని స్ప‌ష్టం చేశారు…. తిరిగి అధికారంలోకి వచ్చాక క‌ర్నూలులో న్యాయ రాజధాని చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈనెల 28న నంద్యాలలో, 29న ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభలు నిర్వహించనున్నామని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో అమలు చేసిన పథకాలపై జ‌గ‌న్ ఈ స‌భ‌లో ప్రజలకు వివరిస్తారన్నారు. సిద్ధం సభ సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement