Sunday, April 28, 2024

AP : చంద్రబాబుపై మంత్రి కారుమూరి ఫైర్‌…

మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అయ్యాయని.. సభలకు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్య సభకు పంపలేదని.. బీసీలను ఓటరు యంత్రాలుగానే వాడుకున్నారని విమర్శించారు. పొత్తుల పేరుతో ముగ్గురు జగన్‌ను ఎదుర్కొనేందుకు ముగ్గురు కాదు.. 30 మంది వచ్చిన ఆయనను ఏం చేయలేరని నొక్కి చెప్పారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని కుట్రలు చేసిన ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారని మంత్రి కారుమూరి జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement