Monday, April 29, 2024

నెల్లూరుకు మంత్రి గౌతం రెడ్డి పార్థివదేహం.. ప్రత్యేక చాపర్ లో తరలిచింన ప్రభుత్వం

హైదరాబాద్ లోని మంత్రి నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి దివంగత మంత్రి గౌతంరెడ్డి భౌతిక దేహం చేరుకుంది. అంబులెన్స్ వెంటే వచ్చిన టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తున్నారు. చాపర్ లో మంత్రి పార్థివదేహం వెంటే సతీమణి శ్రీకీర్తి, తల్లి మణిమంజరి ఉన్నారు. చాపర్ లోకి మంత్రి మేకపాటి పార్థివదేహాన్ని ప్రభుత్వ సిబ్బంది చేర్చింది.

ఉదయం 7గం.లకే బేగంపేట విమానాశ్రయం నుంచి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వైసిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి సోదరులు, కుటుంబ సభ్యులు బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement