Monday, April 29, 2024

దేశానికి దార్శనికుడు కేసీఆరే: ‘దేశ్ కా నేత’ అంటూ శివసేన ఎంపీ ప్రశంసలు

దేశానికే దార్శనికుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని శవసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ, కాంగ్రెసేతర నాయకులను ఒకేతాటిపైకి తీసుకొచ్చి ముందడి నడిపించగల సత్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసార్ కు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన కేసీఆర్.. కష్టపడి పనిచేసే నాయకుడని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తారని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కూడా పేర్కొన్నారు.

కాగా, ఆదివారం(ఫిబ్రవరి 20) మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌లతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమై జాతీయ రాజకీయలపై చర్చించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement