Sunday, April 28, 2024

AP: ఇవాళ సీఎం జగన్ మేము సిద్దం బస్సు యాత్ర

ఇవాళ మేము సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ బుధవారం ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి ప్రారంభించనున్నారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు.

- Advertisement -

ఇక, ఆ తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా మధ్యాహ్నం అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని అనంతరం సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.సభ తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement