Friday, May 3, 2024

అప్పు తీర్చమని ఒత్తిళ్లు.. ఆవేదనతో సెల్ఫీ సూసైడ్

పదివేల అప్పును తీర్చమని తీవ్ర ఒత్తిళ్ళకు గురి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. తుక్కులూరు గ్రామానికి చెందిన ఏసు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు ఆ ముగ్గురు వ్యక్తులే కారణమంటూ  ఏసు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేకాటలో పదివేలు పోవటంతో బాకీ పడ్డ సొమ్మును తీర్చమంటూ ఏసును గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ముగ్గురు పేకాట రాయుళ్లుపై కేసు లేకుండా కొందరు గ్రామస్తులు రాజీకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement