Thursday, May 2, 2024

రాపూరు అడ‌విలో వ్య‌క్తి మిస్సింగ్‌.. జ‌ల‌పాతంలో ల‌భించిన డెడ్‌బాడీ..

నెల్లూరు జిల్లాలో నిన్న రాత్రి ఓ వ్య‌క్తి త‌ప్పిపోయిన ఘ‌ట‌న జ‌రిగింది. న‌లుగురు విద్యార్థులు క‌లిసి రాపూరు ద‌గ్గ‌ర్ల‌లోని సిద్ధ‌ల‌య్య‌కోన జ‌ల‌పాతం చూడ్డానికి వెళ్లారు. సాయంత్రం దాకా అక్క‌డ జ‌ల‌పాతంలో ఆడుకుని ఇంటికి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. అయితే కొంత దూరం వ‌చ్చిన త‌ర్వాత వారిలో ఒక వ్య‌క్తి క‌నిపించ‌క పోవ‌డంతో అక్క‌డ చాలా దూరం వ‌ర‌కు వెతికారు. కానీ ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో రాపూరు పోలీసు స్టేష‌న్‌లో కంప్లెయింట్ చేశారు.

కాగా, రాపూరు అటవీ ప్రాంతంలోని సిద్దలయ్యకొన జలపాతం వద్ద త‌ప్పిపోయిన వ్య‌క్తి ఆచూకీ ఈ రోజు దొరికింది. గూడూరు చవటపాలెం గ్రామానికి చెందిన పాలాపు కిషోర్ అనే యువకుడు గల్లంతు అవ్వగా అత‌డి డెడ్‌బాడీని సిద్ద‌ల‌య్య‌కోన‌ జలపాతంలో గుర్తించారు పోలీసులు. రాపూరు ఎస్సై క్రాంతి కుమార్‌, ఫైర్ స్టేష‌న్‌ సిబ్బంది క‌లిసి కిషోర్ మృతదేహాన్ని జలపాతం నుండి బయటకు తీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement