Saturday, May 4, 2024

AP: ఎన్టీఆర్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య..

పెనుగంచిప్రోలు, జనవరి 27 (ప్రభ న్యూస్) : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకుని పాలెం గ్రామంలో ఒక వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ముళ్లగిరి చిన్న వెంకటేశ్వర్లు (55) కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య 20ఏళ్ల క్రితం మృతి చెందగా, కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.

అయితే పెద్ద కుమారుడు గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఇంటికి దూరంగా ఉంటున్నాడని, చిన్న కుమారుడుతో కలిసి గ్రామంలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చిన్నకొడుకు నవీన్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి పడుకున్నాడు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి పడుకొని ఉన్న తండ్రిని లేపగా.. తలపై బలమైన గాయాలతో అప్పటికే ఆయన మృతిచెంది ఉన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. జగ్గయ్యపేట సీఐ జానకిరామ్, స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్ లు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement