Sunday, April 28, 2024

Kurnool : ప్రేమ జంట ఆత్మహత్య..

ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనకు ప్రధాన కారణం.. వారి ఇద్దరి కులాలు వేరు కావడమే అంటున్నారు.. తుంగభద్ర రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు మృతదేహాలు పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు స‌మాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రెండు మృతదేహాలను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

మృతులు మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన వెంకటేష్ (20) మంత్రాలయంకు చెందిన నందిని (19)గా గుర్తించారు పోలీసులు… గత కొంత కాలంగా వెంకటేష్‌, నందిని ప్రేమించుకోగా.. వారి వ్యవహారం కుటుంబ సభ్యుల వరకు వెళ్లింది.. అయితే, ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో విడిచి ఉండలేక, కలిసి బతకలేక.. ఇద్దరం కలిసి చావాలనే నిర్ణయానికి వచ్చిన ఆ ప్రేమ జంట.. రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement