Sunday, May 5, 2024

Breaking: లోకేష్ యువగళం అట్టర్ ఫ్లాప్.. అంబటి రాంబాబు

టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ నిర్వహించిన యువగళం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ… యువగళం ముగింపు సభ అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు.

గతంలో చంద్రబాబు, లోకేష్ ను పవన్ చాలాసార్లు తిట్టారన్నారు. పవన్ కళ్యాణ్ తన క్యాడర్ ను మోసం చేస్తున్నారన్నారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబుతోనే ఉన్నారన్నారు. చంద్రబాబు అడ్డగోలుగా పరిపాలించినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. టీడీపీని బలోపేతం చేసేందుకే పవన్ పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement