Sunday, April 28, 2024

AP: లోకేష్ రెడ్ బుక్ కేసు.. విచారణ 21కి వాయిదా…

రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది. రెడ్ బుక్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరువ‌ర్గాల వాద‌న విన్న కోర్టు విచార‌ణ‌ను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement