Friday, April 26, 2024

జగన్ కి ఏడుకొండల వాడిపై విశ్వాసం లేనట్లే: అచ్చెన్నాయుడు

తిరుపతిలో సెటిలయ్యేందుకు ఎవరొస్తారంటూ గతంలో వైఎస్ జగన్ వ్యాఖ్యానించారంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తిరుపతి ఎవొరస్తారని అంటున్నారంటే మీకు శ్రీవారిపై విశ్వాసం లేనట్టేగా? అని నారా లోకేశ్, కోనేటిరాయుడి సన్నిధికి ఎవరొస్తారనేంత గర్వం జగన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వెంకన్న స్వామిపై విశ్వాసం ఉంచి ప్రపంచమంతా తిరుపతి వస్తుంటే, జగన్ వ్యాఖ్యలు సరికాదని లోకేశ్ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత భేదాల్లేకుండా… పేద, ధనిక అనే తేడాలు చూపని శ్రీవారిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ తిరుపతికి శతాబ్దాలుగా వస్తూనే ఉన్నారని అన్నారు. అలాంటి తిరుపతికి ఎవరూ రారని అంటున్నారంటే ఏడుకొండలవాడిపై విశ్వాసం లేదని జగన్ రెడ్డి ఒప్పుకుంటున్నట్టే కదా! అని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement