Thursday, May 2, 2024

ఎస్వీ యునివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌లో చిరుత… భయంతో పరుగులు తీసిన విద్యార్థులు

తిరుపతి, తిరుమలను ఇప్పట్లో చిరుత భయం వదిలేదా లేదు.. తిరుమలలో చిన్నారిపై దాడి చేసిన చిరుత.. ఈ రోజు బోనులో పడింది. స్వల్పంగా గాయపడటంతో చికిత్స అందించారు. మెట్ల మార్గంలో.. కాలినడక భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలినడకన వెళ్లే భక్తుల కోసం.. సెక్యూరిటీని నియమించింది. మరోవైపు శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.. ఇక్కడితో అయిపోలేదు.. ఇప్పుడు తిరుపతి ఎస్వీ యునివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌లో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసి భయంతో పరుగులు తీశారు.

విద్యార్థులు. ఇక, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు యూనివర్సిటీ సెక్యూరిటీ.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు, అటవీశాఖ సిబ్బంది చిరుత ను తరిమి వేసే పనిలో నిమగ్నమయ్యారు.కాగా, ఓవైపు తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తుండగా.. ఇప్పుడు ఎస్వీ యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇచ్చి షాక్‌ ఇచ్చింది

Advertisement

తాజా వార్తలు

Advertisement