Sunday, April 28, 2024

AP: విశాఖ నార్త్ నుంచి ల‌క్ష్మీనారాయ‌ణ పోటీ…

విశాఖపట్నం : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను విశాఖ‌ప‌ట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని జై భారత్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ జె.డి. వి.వి.లక్ష్మీనారాయణ ప్ర‌క‌టించారు. ఎంవీపీకాలనీ సెక్టారు-10లోని ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్‌ ఫ్రంటు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందని.. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో గ్రూపు-1ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement