Sunday, April 28, 2024

Kurnul – క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కర్నూల్ నగరంలోని మూడవ పట్టణ పోలీస్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా ను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక దేవనగర్లో గల ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో మూడవ పట్టణ సీఐ తబరేజ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.

బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని వివరాలు సేకరించిన అనంతరం వివరాలు తెలియజేస్తామని సీఐ తబ్రజ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement