Tuesday, April 30, 2024

నంద్యాల నడిగడ్డలో వైయస్సార్ గల్లీ దవాఖాన : ఎమ్మెల్యే ర‌విచంద్ర‌కిషోర్ రెడ్డి

నంద్యాల : ఎమ్మెల్యే సొంత నిధులతో నంద్యాల నడిగడ్డలో వైయస్సార్ గల్లీ దవాఖాన ఏర్పాటు చేశారు. ఆస్ప‌త్రిలో వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులను అందించనున్నారు. శుక్ర‌వారం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి దవాఖానను ప్రారంభించి ప్ర‌సంగించారు. ప్రజలకు సేవ చేయ‌డ‌మే ధ్యేయం అన్నారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దవాఖానలో వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ నాగేశ్వర రావు వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, శిల్పా మహిళ బ్యాంక్ చైర్మన్ నాగిని రవిసింగా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, వైస్ చైర్మన్ లు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement