Friday, May 17, 2024

మైనారిటీలపై ఎందుకింత కక్ష జగన్ రెడ్డి?!

రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సాక్షీభూతం.. అర్థంతరంగా నిలచిపోయిన ఈ కళాశాల నిర్మాణం అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదోని నియోజకవర్గం ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్ధూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించి.. నిర్మాణ పనులు కూడా ప్రారంభించామ‌న్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను అంగుళం కూడా ముందుకు సాగనీయకుండా పాడుబెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదోనిలో యువగళం పాదయాత్రలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతగాదు… గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement