Thursday, May 23, 2024

Kurnool: చేప‌ల వేట‌కు వెళ్లి గ‌ల్లంతైన దంప‌తుల మృత‌దేహాలు ల‌భ్యం

కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన దంపతులిద్దరు మృతి చెందారు. నిన్న చేపల వేటకు వెళ్లిన వీరి పుట్టి ఈదురుగాలుల కారణంగా బోల్తా పడి గల్లంతయ్యారు. నిన్న గజ ఈతగాళ్ల సహాయంతో గాలించినా ఫలితం కనపించలేదు. ఈ రోజు కొంత దూరంలో దంపతుల మృతదేహాలు అక్కన్న, జయలక్ష్మి లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పుట్టి మునిగి గ‌ల్లంతైన దంప‌తులు అంకన్న(28), జయలక్ష్మి(24)ల‌కు ఇద్దరు చిన్నపిల్లలున్నారు. రిజర్వాయర్ లో గల్లంతైన వారి కోసం. 50 మంది మత్స్యశాఖ సిబ్బందితో ప్రత్యేకంగా గాలించడంతో మృత‌దేహాలు ల‌భ్య‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement