Monday, April 29, 2024

భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టివేత

భారీగా బంగారు ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాలు ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో ఎప్పటి మాదిరిగానే పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న ఎన్‌ఎల్‌ 01 బీ 2048 అనే నంబర్‌ గల నిదా ట్రావెల్స్‌ ప్రైవేటు బస్సులో తనిఖీ చేయగా రాజస్థాన్‌లోని జున్జున్ పట్టణానికి చెందిన కపిల్ అనే వ్యక్తి బ్యాగులో దాదాపు 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఉన్న తన అన్న ఈ నగలను బెంగళూరులోని పలు నగల దుకాణాలకు ఇచ్చి రమ్మన్నాడని, అంతకు మించి తనకేమీ తెలియదని కపిల్‌ పోలీసులకు చెప్పాడు. ఆభరణాలకు సంబంధించి ఈ-వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్, జీఎస్టీ బిల్లులు లేకుండా బంగారం, వజ్రాలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగారం తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన కపిల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీటి విలువ దాదాపు రూ.39.28 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement