Saturday, May 4, 2024

ట్రావెల్స్ బస్సులో 12 కేజీల వెండి.. భారీగా నగదు పట్టివేత

కర్నూలులోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద భారీగా వెండిని సెబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబీ సీఐ మంజుల వెల్లడించిన మేరకు వివరాలు ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న VLR ట్రావెల్స్ బస్ ని తనిఖీ చేశారు. బస్సులో సేలంకి చెందిన ఎస్. రాజు అనే వ్యక్తి బ్యాగులో సోదాలు నిర్వహించారు. అందులో 12 కేజీల వెండి, రూ. 2.60 లక్షల నగదును గుర్తించారు. అయితే, వాటి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని విచారణ నిమిత్తం తాలూక పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్ఐ గోపాల్, కానిస్టేబుల్ శాంతరాజు, తిమ్మప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement