Thursday, April 25, 2024

Kurnool: 12కేజీల వెండి, రూ.2.60ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం

స్థానిక పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు 12 కేజీల వెండిని సెబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబీ సీఐ మంజుల వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వీఎల్ఆర్ ట్రావెల్స్ బస్ లో సేలంకి చెందిన ఎస్.రాజు అనే వ్యక్తి 12 కేజీల వెండి, రూ.2.60 లక్షల నగదుతో వెళ్తుండగా అనుమానంతో అతని బ్యాగులో సోదాలు నిర్వహించారు. నగదు, వెండిని గుర్తించిన పోలీసులు వాటికి సంబంధించిన పత్రాలు చూపాల్సిందిగా రాజును కోరారు. అయితే అతను ఎటువంటి పత్రాలు చూప‌క‌పోవడంతో పోలీసులు వాటిని స్వాధీన పరచుకొని తదుపరి విచారణ నిమిత్తం తాలూక పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్ఐ గోపాల్, కానిస్టేబుల్ శాంతరాజు, తిమ్మప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement