Wednesday, May 15, 2024

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

ఏపీలోని కర్నూలులో జిల్లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఓ బైక్ అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడింది. ఈ ప్రమాదంపై బైక్ వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement