Monday, April 29, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు త‌గ్గ‌ని వ‌ర‌ద‌..

రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌కు ప్రాజెక్టుల‌న్నీ జ‌ల‌క‌ల‌ను సంత‌రించుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి ఇంకా వరద నీరు కొనసాగుతుంది. ఈ జలాశయానికి ఇన్‌ఫ్లో 61,517 క్యూసెక్కుల నీరు వస్తుండగా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.10 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement