Monday, May 6, 2024

కర్నూల్ లో ‘మా నమ్మకం నువ్వే జగన్’

మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను శుక్రవారం కర్నూల్ లో ఆవిష్కరించారు. పాణ్యం ఎమ్యెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగర మేయర్ బీవై.రామయ్య ఆధ్వర్యంలో కర్నూల్ నంద్యాల చెక్ పోస్ట్ వెళ్లే దారిలో ఉన్న శకుంతల కళ్యాణ మండపంలో శుక్రవారం జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను ఆవిష్కరించారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు 7 ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే విషయాలను, అలాగే వారివారి సచివాలయ పరిధిలో ఉన్న కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడాలి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా అన్న వాటిని పరిశీలిస్తూ, వారితో కాసేపు ముచ్చటించి అనంతరం వారి సమక్షంలోనే వారి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను అతికించాలని సూచించారు…


విలేకరుల సమావేశం అనంతరం మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ వార్డులో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బి వై. రామయ్య పాల్గొన్నారు. మేయర్ స్వయంగా కొన్ని ఇళ్లను సందర్శించి వారితో కాసేపు మాట్లాడి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈసారి కూడా మన జగనన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వారి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను అతికించి ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, డీ.ఏ.ఏ.బీ చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, కర్నూలు నగర మార్కెట్ యార్డ్ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి, తెలుగు అకాడమీ డైరెక్టర్ వై.సుధ, పలువురు కార్పొరేటర్లు, జేసీఎస్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ కన్వీనర్లు, గృహ సారథులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement