Monday, April 29, 2024

కరోనా టీకా వేయించుకున్న కలెక్టర్ వీరపాండియన్

కర్నూలు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్​ జి. వీరపాండియన్​. ప్రభుత్వ ఆదేశాల జిల్లాలో హెల్త్ వర్కర్స్ & ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్ప్రతిలోని ఓల్డ్​ గైనిక్​ విభాగంలో కలెక్టర్​ జి. వీరపాండియన్​కు కోవిడ్​ స్పెషల్​ ఆఫీసర్​ జి. సాయిప్రసాద్​ కోవిడ్​ వ్యాక్సిన్​ వేశారు. అనంతరం రాష్ట్ర ఇంధన శాఖ ఎక్స్-అఫిషియో స్పెషల్ సీఎస్ మరియు కర్నూలు జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ జి.సాయిప్రసాద్ వ్యాక్సిన్​ వేయించుకున్నారు. అంతకు ముందు కోవిడ్​ వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని కలెక్టర్​ తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిజిహెచ్ ఇన్​చార్జ్​ సూపరింటెండెంట్ డా.భగవాన్ దాస్, డిఎంహెచ్ఓ డా.రామగిడ్డయ్య, డి.ఐ.ఓ. డా.విశ్వేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement