Thursday, April 25, 2024

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సెల్ఫ్ కర్ఫ్యూ..

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో కరోనా విజృంభిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డికి ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో సెల్ఫ్ లాక్ డౌన్, విదించుకుంటున్నారు . ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో కర్ఫ్యూ అమలవుతోంది. సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించకపోతే రూ.500 జరిమానా..కర్ఫ్యూ సమయంలో షాపులు తెరిస్తే రూ. 500 జ‌రిమానా విధించాల‌ని గ్రామ పంచాయ‌తీ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement