Friday, May 17, 2024

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత : ముగ్గురు అరెస్టు

ఎమ్మిగనూరు : పట్టణ స్టేషన్ పరిధిలోని మంత్రాలయం మండలం చట్నీపల్లి గ్రామంలో దాడులు చేయగా ఈ దాడుల్లో దాదాపుగా 30 బాక్స్ లు కర్ణాటక మద్యం దొరికిందని ఎమ్మిగనూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో జయరామ్ నాయుడు అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… స్వాధీనం చేసుకున్న మద్యం 90 ఎమ్మెల్ టెట్రా ప్యాకెట్స్ దాదాపుగా 30 బాక్సులు ఉన్నాయని, వీటి విలువ 1,20,000 ఉంటుందన్నారు. ముద్దాయిలు చట్నీపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు ఉరుకుందు, రెండవ ముద్దాయి చెట్నీపల్లి గ్రామానికి చెందిన బజారి కుమారుడు రాము, మూడవ ముద్దాయి చట్నీపల్లి గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు వీరేష్, ఈ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని వారు తెలిపారు. అలాగే బూదూరు గ్రామంలో మంగళవారం దాడులు చేయగా 5 బాక్సులు టెట్రా ప్యాకెట్లను సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని వారు తెలిపారు. ఇంకా ఎవరైనా కర్ణాటక మద్యం అమ్మితే మానుకోవాలని… లేదంటే అలాగే అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ సోమశేఖర రావు, గోపాల్, నరసింహా రెడ్డి, రామచంద్రులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement