Thursday, May 2, 2024

NDL: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

బేతంచెర్ల మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన లక్ష్మన్న అనే రైతు అప్పుల బాధ తాళలేక శనివారం మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితున్ని చికిత్స నిమిత్తం కర్నూలుకు ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు ఇవాళ మృతిచెందాడు. మృతునికి భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement