Sunday, May 19, 2024

Breaking : క‌ర్నూలు జిల్లాలో జింకల‌ క‌ళేబ‌రాల క‌ల‌క‌లం

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు జింక‌ల‌ను చంపేయ‌డంతో జింక‌ల క‌ళేబ‌రాలు బ‌య‌ట‌ప‌డిన‌ ఘ‌ట‌న‌ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చిచంపారు. ఆదోని మండలం నారాయణపురం వద్ద ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదోని సరిహద్దు చెక్​పోస్టులను అధికారులు అప్రమత్తం చేశారు. నిందితులు కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement