Monday, May 20, 2024

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు : ఉత్తమ్

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్త‌మ్ కుమార్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అంతేకాకుండా కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంద‌ని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి… నియోజక వర్గాలకు వెళ్లాల‌ని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు తాను ఎక్కడ పోటీ చేయాలనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు. ఇప్పటి నుంచి కష్ట పడితేనే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement