Saturday, May 4, 2024

దారుణం.. మంద‌లించాడ‌ని తండ్రిని చంపిన కొడుకు

కోసిగి : తండ్రి మందలించడాన్ని జీర్ణించుకోలేక మద్యం మత్తులో కన్నా తండ్రినే గొడ్డలితో అతి దారుణంగా నరికిచంపిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి కోసిగిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు సంతానం. ఇందులో పెద్దకుమారుడు నరసింహులు తండ్రి వీరయ్యకు మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఇద్దరు కూడా మద్యం తాగి గోడవపడేవారు. నరసింహులు ప్రవర్తన సరిగా లేదని కొందరు గ్రామస్తులు తండ్రి వీరయ్యకు గత కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కొడుకు నరసింహులును గత మూడు రోజుల క్రితం తండ్రి వీరయ్య మందలించారు. దీనిని జీర్ణించు కోలేని నరసింహులు అదను చూసి తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మద్యం తాగి మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపి అదే గొడ్డలితో సోమవారం ఉదయం కోసిగి వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడు నరసింహులును అదుపులోకి తీసుకొని గొడ్డలిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి మృతదేశాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. కాగా కన్నా తండ్రినే కొడుకు అతి దారుణంగా హత్య చేయడం కోసిగిలో చర్చ నీయంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement