Sunday, May 5, 2024

అమరావతే AP రాజధాని .. రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధానే ఉండాలని.. అమరావతే ఏపీ రాజధాని అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో బుధవారం రెండో రోజు ఆదోని నియోజకవర్గంలో సాగుతోంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీకి మూడు రాజధానుల ఆలోచన సరైంది కాదన్నారు. విభజన సమయంలో కేంద్రం ఏపీకి కొన్ని హామీలు ఇచ్చిందన్నారు.

పోలవరం, ప్రత్యేక హోదా ఇచ్చిన హామీల్లో ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. వైసీపీతో పొత్తుపై తాను నిర్ణయం తీసుకోలేనన్నారు. భవిష్యత్ లో పొత్తులపై కాంగ్రెస్ అధ్యక్షుడే చెబుతాడన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ఇస్తున్నామన్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement