Saturday, May 4, 2024

Kurnool – వైభవంగా కొనసాగుతున్న గణేష్ శోభాయాత్ర

కర్నూలులోని నేడు గణేష్ శోభయాత్ర వైభవంగా ప్రారంభమైంది.. వందలాది వాహానాలలలో గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాలలో ఉన్న నదులు, చెరువులు, నీటి కుంటల వద్ద ఏర్పాటు చేసిన వినాయక ఘాట్ కు చేరుకుంటున్నాయి. కాగా, రాంబొట్ల దేవాలయం నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి పూజలు చేసి నిమజ్జనానికి సాగనంపారు కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు డా.బైరెడ్డి శబరి తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement