Saturday, May 18, 2024

Protest – నిధులివ్వండి మ‌హాప్ర‌భో….ఎపి స‌ర్కార్ కి సర్పంచుల మొర

గుంటూరు : 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ ఏపీ సర్పంచ్ ల సంక్షేమ సంఘం ఆందోళనకు దిగింది. తాడేపల్లిలో పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడికి సిద్దమయ్యారు సర్పంచులు. ఒక్కసారిగా సర్పంచులందరు పంచాయతీరాజ్ కమిషనరేట్ వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సర్పంచులను అడ్డుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తక్షణమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.691 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు విడుదల చేయాలని… సర్పంచుల గౌరవ వేతనాన్ని 3000 నుంచి 15 వేలకు పెంచాలని డిమాండ్ చేసారు. త‌మ జీతాలు వాలెంట‌ర్లు జీతాల కంటే త‌క్కువ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.. అప్పులు చేసి గ్రామాల‌లో అభివృద్ధి ప‌నులు చేప‌డితే ఆ నిధులు త‌మ‌కు ఇవ్వ‌డం లేద‌ని వాపోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement