Sunday, May 19, 2024

అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాలి

కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు, చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత ఆదేశించారు.ఈరోజు మచిలీపట్నం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాట్లపై ఆమె వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
Officers-in-coordination-th

సముద్ర స్నానాలకు లక్ష నుండి 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.పాండురంగ స్వామి ఉత్సవాలకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ సమావేశంలో ఆర్డీఓ ఖాజావలీ, జడ్పీ సీఈఓ సూర్యనారాయణ, ఇంచార్జ్ డ్వామా పీడీ జివి సూర్యనారాయణ,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ, తహశీల్దార్ సునీల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement